యువత వినూత్న ఆలోచన!

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అనుకూలంగా అంకురాలు

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): ఇంటర్‌నెట్‌ కేంద్రాల మాదిరి.. ఇప్పుడు ఈ`కామర్స్‌ కేంద్రాలు వెలుస్తున్నాయి. విూరు ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే సవిూపంలోని వీటి వద్దకు వెళితే చాలు. అక్కడ పెద్ద టీవీ తెరపై వస్తువులన్నీ కనిపిస్తాయి. వాటిని ఎంపిక చేసుకుని ఆర్డర్‌ ఇవ్వడమే తరువాయి. ఇంటికే వచ్చేస్తాయి. నగరంలో అయితే అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు, డేటా కనెక్షన్‌ ఉండడంతో సొంతంగా ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేస్తున్నారు. శివారు, గ్రావిూణ ప్రాంతాల్లో ఆ అవకాశం లేకపోవడంతో.. వీరే లక్ష్యంగా ఈ వినూత్న ఆలోచనతో యువత ముందుకు వస్తోంది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయాలంటే ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండాల్సిందే.. నగరంలో అయితే ఇంట్లో పీసీ.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో ఎక్కువగా వీటిలో లావాదేవీలు చేస్తున్నారు. అయినా చాలామంది ఈ సేవలకు దూరంగా ఉంటున్నారు. గ్రావిూణ ప్రాంతాల సంగతి చెప్పక్కర్లేదు.. మరోవైపు ప్రధాని మోదీ డిజిటల్‌ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇదే ఆ యువకులను ఆలోచింపజేసింది. ఆన్‌లైన్‌లో కొంటున్నవారు 10 శాతం లోపే ఉన్నారు. ఈ రంగంలో వృద్ధికి అవకాశం ఉందని భావించి.. డిజిటల్‌ అవుట్‌లెట్స్‌తో ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్రారంభించిన ఈ కామర్స్‌ కేంద్రాలలో సగటున రోజుకు 10`12 ఆర్డర్లు వస్తున్నాయి. నెలకు 300`350 మంది సందర్శిస్తున్నారు. మార్కెట్‌ కంటే ఇటీవల కాలంలో మొబైల్‌ కంపెనీలు కేవలం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని, తక్కువ ధరకు ఇస్తున్నాయి. అలాంటి సమయంలో తమ డిజిటల్‌ అవుట్‌లెట్‌ను ఎక్కువ మంది వినియోగించు కుంటున్నారని  తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫ్‌లైన్‌ స్టోర్లుగా వీటిని నిర్వాహకులు చెబుతున్నారు. వేర్వేరు సంస్థలతో వీరు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ`కామర్స్‌ స్టోర్‌ను సందర్శిస్తున్న వినియోగదారులు ఆన్‌లైన్‌లో ధరలు చూసి బయట మార్కెట్‌తో పోల్చుకుంటున్నారు. తక్కువ ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా వస్తువులు శివార్లు, పట్టణాల్లో దొరకవు. అటువంటివాటికి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తున్నారు.