గంగానదిని శవాలతో నింపారు

 



` సగంకాలిన శవాలు,కుళ్లిన మృతదేహాలు కొట్టుకొట్టుస్తున్నాయి
` ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి
దిల్లీ,డిసెంబరు 25(జనంసాక్షి): కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో గంగానదితో పాటు దాని ఉపనదుల్లో 300కు పైగా సగం కాలిన శవాలు, కుళ్లిన మృతదేహాలు కొట్టుకొచ్చాయని.. పవిత్రమైన గంగానది డంపింగ్‌ యార్డుగా మారిందని ‘క్లీన్‌ గంగ’ జాతీయ పథకం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు. గురువారం ఆయన రాసిన ‘గంగ’ అనే పుస్తకాన్ని ప్రధాని ఆర్థిక కౌన్సిల్‌ సలహాదారులు బిబేక్‌ దెబ్రాయ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘గంగ’ పుసక్త రచయిత రంజన్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో దేశంలో సరిపడా బెడ్లు లేక, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో వైరస్‌తో చనిపోయిన వారిని ఏమి చేయాలో తెలియని జిల్లా పాలనా యంత్రాంగం.. శవాలను సులభంగా డంపింగ్‌ చేసేందుకు గంగానదిని ఎంచుకుంది. కరోనా మృతదేహాలను ఖననం చేయడంపై అవగాహన లేక కొందరు, అంత్యక్రియలకు డబ్బుల్లేక మరికొందరు వారి మృతదేహాలను గంగానదిలో పడేశారు’’ అన్నారు. అంత్యక్రియల నిర్వహణ సరిగా లేకపోవడం, మృతదేహాలను దహనం చేయకుండా నదిలో పడేయడం గురించి తెలియజేసేందుకే ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత వెల్లడిరచారు.