కోకాపేట భూముల అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌


` కొన్నవారికి రిజిస్టేష్రన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్‌,డిసెంబరు 22(జనంసాక్షి):నగర శివార్లలోని కోకాపేట నియోపోలిస్‌ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 239, 240 సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివేనని నిర్దారించారు. ప్రభుత్వ ఏజెంట్‌గా హెచ్‌ఎండీఏ భూములు వేలం వేసిందని ప్రభుత్వం తెలిపింది. వేలంలో భూములు కొన్న బిడ్డర్లకు రిజిస్టేష్రన్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ ఏడాది జులైలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో ఎª`లాట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ఎª`లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం పక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్‌ పార్ట్‌ గల ఎª`లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు మరోసారి గుర్తింపు వచ్చింది. కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్‌ లేఅవుట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్‌ అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్‌ రింగురోడ్డును అనుకొని ఉండటంతోపాటు పక్కనే గచ్చిబౌలి ్గªనాన్షియల్‌ డిస్టిక్ర్‌ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్‌ లే అవుట్‌లోని 8 ఎª`లాట్లను ఒకే రోజు ఆన్‌లైన్‌ వేలం విక్రయించారు.