ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

అమరావతి,డిసెంబర్‌10(జనం సాక్షి): ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై ఎల్లో విూడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. కొన్ని విూడియా సంస్థలు ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆధారలు లేకుండా కథనాలు ప్రచురిస్తున్నాయి. అబద్దాలు, వితండవాదంతో కథనాలు ఇస్తున్నాయి. ఓటీఎస్‌పై ఎవరినీ బలవంత పెట్టలేదు. ఇది పూర్తిగా స్వచ్చంద పథకం. ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్‌ను వినియోగించుకోవచ్చు. లబ్దిదారులపై రిజిస్టేష్రన్‌ భారం పడకుండా చూశాం. ఉచిత రిజిస్టేష్రన్‌తో ప్రభుత్వం విూద రూ.6వేల కోట్లు భారం పడుతోంది. గత ప్రభుత్వ టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్‌ చేసింది. టీడీపీ హయాంలో పేదలకు ఇల్లు కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు. ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా తప్పు పడితే ఎలా..?’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.