మా బంధం బలమైనది


` రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ
` ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
` రక్షణ తదితర రంగాలపై ఇరుదేశాల సంతకాలు
` ఇరుదేశాల బంధం మరింత బలంగా కొనసాగుందని ప్రకటన
న్యూఢల్లీి,డిసెంబరు 6(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశ మయ్యారు. ఢల్లీిలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ సంతకాలు చేశారు. కోవిడ్‌ నుంచి ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం`రష్యా సంబంధాల వృద్ధి వేగంలో ఎటువంటి మార్పు ఉండదని ఇరుదేశాలు ప్రకటించాయి. తమ ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందంటూ భారత్‌, రష్యా ప్రకటించాయి. ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచం అనేక మార్పులను చూసిందని.. వివిధ రకాల భౌగోళిక రాజకీయ సవిూకరణాలు ఉద్భవించాయని పేర్కొన్నారు. అయితే భారతదేశం, రష్యాల స్నేహం స్థిరంగా ఉందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌, రష్యా మధ్య సంబంధం అంతర్జాతీయ స్నేహానికి ఒక ప్రత్యేక నమూనా అంటూ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. భారత్‌తో 5 బిలియన్‌ డాలర్ల డిఫెన్స్‌ డీల్‌పై చర్చలు పుతిన్‌ జరిపారు. ఎల్‌ఏసీ దగ్గర చైనా దురాక్రమణపై కూడా ఇరు దేశాల నేతలు చర్చల్లో ప్రస్తావించారు. కరోనాపై భారత్‌ ` రష్యా కలిసి పోరాటం చేశాయని మోదీ, పుతిన్‌ పేర్కొన్నారు. 74 ఏళ్ల నుంచి భారత్‌`రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని.. రష్యాతో స్నేహం నిరంతరం కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం సాయంత్రం ఢల్లీి చేరుకున్నారు. అయితే.. రెండేళ్ల తర్వాత మోడీ, పుతిన్‌ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 21వ వార్షిక భారత్‌`రష్యా శిఖరాగ్ర సమావేశంలో మోదీ, పుతిన్‌ రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రూ.5,124 కోట్లతో భారత్‌లో 6 లక్షల కలష్నికోవ్‌ ఏకే`203 రైఫిళ్ల తయారీ, స్వల్ప దూరంలోని శత్రు లక్ష్యాల నాశనం కోసం రష్యా నుంచి రూ.11,262 కోట్లతో గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ రష్యా మధ్య ఒప్పందాలు జరిగాయి. కనుచూపుమేరలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చివేయడానికి ఉపకరించే ఇగ్లా`ఎస్‌ విమాన విధ్వంసక క్షిపణులనూ రష్యా నుంచి భారత్‌ సవిూకరించనుంది. భుజం విూద నుంచి ప్రయోగించే ఇగ్లా`ఎస్‌ క్షిపణి తయారీ, పలు అంశాలపై చర్చించారు. భారత్‌, రష్యా సైనిక దళాలు మరింత తరచుగా, ఉన్నత స్థాయిలో సంయుక్త విన్యాసాలు జరిపే విషయంలోనూ మోడీ పుతిన్‌ భేటీలో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. రష్యా నుంచి రూ.40 వేల కోట్లతో భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌`400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థల బట్వాడా పక్రియను వేగవంతం చేయడానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.