వరిసాగుపై ఎలాంటి నిబంధనలు లేవు: తోమర్‌

  


న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి):  తెలంగాణాలో  పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. 2021 రబీ సీజన్‌ కు సంబంధించి వరి లేదా ఇతర పంటల సాగుపై కేంద్రం ఏమైనా నిబంధనలు విధించిందా అని కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు నరేంద్ర సింగ్‌ తోమర్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు .  రైతులు వరి సాగు చేయొద్దు.. ఇతర పంటలు వేసుకోవాలని  సీఎం కేసీఆర్‌ చెబుతున్న  నేపథ్యంలో  కేంద్ర  వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం  ప్రాధాన్యత సంతరించుకుంది.