బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యమా ?

టిఆర్‌ఎస్‌ పోరుబాట వెనక కారణలు ఇవేనా

ధాన్యం కొనుగోళ్లతో చేస్తున్న ధర్నాలు కలసివచ్చేనా
తృతీయ ఫ్రంట్‌ వైపు మళ్లీ కెసిఆర్‌ అడుగులు పడేనా
హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల టిఆర్‌ఎస్‌ను భయపెడుతోందా... హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితం తరవాత టిఆర్‌ఎస్‌ రూటు మార్చడానికి కారణం ఏమిటి అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేవలం ధాన్యం కొనుగోళ్లతో బిజెపికి వ్యతిరేకంగా తీసుకున్న టర్న్‌ ఆరణంగా ముందుగా నష్టపోయేది టిఆర్‌ఎస్‌ మాత్రమే అని ఆ పార్టీ అధినేత గుర్తించడం లేదు. రైతుల ధాన్యం కొనకపవోడం, వచ్చే యాసంగిలో కిలో ధాన్యం కూడా కొనబోమని చెప్పడం ద్వారా రైతుల్లో అనవసర వ్యతిరేకతలను టిఆర్‌ఎస్‌ మూటగట్టుకుంటోందని గుర్తించడం లేదు. కేంద్రంపై పోరాటం చేయడానికి సమస్లయు వేరుగా ఉండాలి. ధాన్యం సమస్యతో యుద్దం చేయడం వల్ల లాభం కన్నా నష
ª`టమే ఎక్కువ. నిజానికి ఇంతకాలం టిఆర్‌ఎస్‌ పార్టీ ఓ రకంగా బిజెపికి అంటకాగింది. ప్రధాని మోడీ తీసుకున్న అనపేక నిర్ణయాలకు తలూపింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్‌ఎస్‌ మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. కాబట్టి కేంద్రంతో టీఆర్‌ఎస్‌ విధానం లోపాయకారిగా అనుకూలంగా నడిచిందన్న ఆరోపణల వచ్చాయి. మోడీ కనుసన్నల్లో కేసీఆర్‌ నడుస్తున్నారనే భావన కలిగించింది. ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడిరది. ఐతే, హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఓటమి తరువాత బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ తప్పనిసరి పరిస్థితిలో తన విధానం మార్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు దానిని సూచిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ఎదరుదాడికి దిగే పరిస్థితి తెచ్చుకోవడం వెనక బిజెపి బలపడకుండా చూడలన్న లక్ష్యం తప్ప మరోటి కాదు. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీ పుంజుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్‌ కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్‌ఎస్‌లో గుబులు రేపింది. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి కేసీఆర్‌ కు పెద్ద షాక్‌ అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్‌ ఆందోళనకు కారణం కావచ్చు. బహుశా ఆందుకే ఆయన తాత్కాలికంగా అయినా కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది. వివాదాస్పద వరి సేకరణ సమస్యపై ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతును టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని అనుసరించింది. చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధించింది. బిల్లలుకు మద్దతిచ్చింది. లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప ఏనాడూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. మోడీ సర్కార్‌ని విమర్శించటం పెద్దగా చేయలేదు. ఎన్నికల వేళ మాత్రమే పరస్పర విమర్శలకు పదను పెట్టాయి. ఎన్నికల తరువాత మళ్లీ షరా మామూలే అన్నట్లుగా ఇంతకాలం చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. నిజానికి దుబ్బాక తరవాత కూడా బిజెపి అంటే టిఆర్‌ఎస్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే మారిన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పద సాగు చట్టాలు, లఖింపూర్‌ ఖేరీ దుర్ఘటన, విద్యుత్‌ సంస్కరణలు, పెరుగుతున్న ఇంధన ధరలు, చైనా దురాక్రమణతో పాటు ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వంపై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు.
పార్టీ ఇప్పటి వరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలి పెట్టాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. ఎంపీలకు దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో తొమ్మిది మంది, రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఇతర ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో కేంద్రానికి వ్యతిరేకంగా తమ దాడిని తీవ్రం చేసారు. ఈ పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించారు. నిజానికి, బీజేపీని టార్గెట్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వరి కొనుగోలు అంశాన్ని తెరవిూదకు తెచ్చింది. కాబట్టి దీనిని కేంద్రం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌లా కాకుండా బీజేపీ విూద టీఆర్‌ఎస్‌ యుద్ధంగా చూస్తే బాగుంటుంది. ధాన్యం కొనుగోలు అంశంపై కొద్ది రోజులుగా బీజేపీని, కేంద్రాన్ని కేసీఆర్‌ దునుమాడుతున్నారు. రైతుల ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు దీనిపై గట్టిగానే పోరాడారు. దీంతో 20న సోమవారం మరోమారు ధర్నాలను చేపట్టారు. మరోవైపు, ఈ పరిణామాలను బీజేపీ మరోలా తీసుకుంటోంది. 2023 ఎన్నికల్లో బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారని ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. ఐతే, బీజేపీకి ధీటుగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార నినాదాన్ని సృష్టించే దిశగా కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలు తృతీయ ఫ్రంట్‌కు దారితీస్తాయా లేదా అన్నది చూడాలి.