వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వండి

కేసుల పెరుగుదలతో కేంద్రాన్ని కోరిన కేజీవ్రాల్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కోరారు. బూస్టర్‌ డోసులిచ్చే పక్రియను ప్రారంభించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి ఆదివారం ఒక్కరోజే ఢల్లీిలో 107 కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారంనాడు విూడియాతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయితే ఇవి ఏ తరహా కోవిడ్‌ కోసులనేవి నిర్దారించే ప్రయత్నం జరుగు తోందని, నార్మల్‌ కేసులా ఒమైక్రాన్‌ కేసులా అనేది నిర్దారించేందుకు పాజిటివ్‌ కేసులకు సంబంధించిన శాంపుల్స్‌ను జెనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నట్టు చెప్పారు. ప్రజలు ఎవరూ భయందోళన చెందవద్దని, ఒమైక్రాన్‌ విస్తరించిన పక్షంలో సమర్ధవంతంగా ఎదర్కొనేందుకు ఆసుపత్రుల్లో తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన బూస్టర్‌ డోసులు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇక నుంచి ఢల్లీిలో పాజిటివ్‌ వచ్చే కేసులన్నింటికీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఢల్లీి సీఎం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దు అన్నారు. ఒమిక్రాన్‌ ప్రభావం మైల్డ్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారని, ఒమిక్రాన్‌ వల్ల హాస్పిటల్‌లో చేరుతున్నవారి సంఖ్య, మరణాలు తక్కువగా ఉన్నట్లు కేజ్రీవాల్‌ చెప్పారు. అన్ని కేసుల విషయంలోనూ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని, హోం ఐసొలేషన్‌ను పటిష్టం చేస్తున్నామని చెప్పారు. రెండు డోసులు వేయించుకున్న సీనియర్‌ సిటిజన్లు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు కేంద్రం అనుమతించాలని కోరారు. కాగా, సోమవారంనాడు మరో రెండు ఒమైక్రాన్‌ కేసులు వెలుగుచూడటంతో ఢల్లీిలో ఈ కేసుల సంఖ్య 24కు చేరింది.