సమాజ్‌వాది మద్దతుదారుల ఇళ్లపై ఐటి దాడులు


తీవ్రంగా ఖండిరచిన ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌

ఇదంతా కక్షసాధింపు ధోరణి అంటూ విమర్శలు
లక్నో,డిసెంబర్‌18 (జనంసాక్షి):   సమాజ్‌వాదీ పార్టీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు, మద్దతుదారులు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ ఐటీశాఖ సోదాలు చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ అధిరారులు సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్‌ రాయ్‌ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదతో లింకు ఉన్న పలువురి ఇండ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని, తన వద్ద నల్లధనం కూడా లేదని రాజీవ్‌ రాయ్‌ అన్నారు. ప్రజలకు హెల్ప్‌ చేస్తుంటానని,
కానీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదన్నారు. దాని వల్లే ఇలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. విూరేదైనా చేస్తే, వాళ్లు వీడియో చేసి, ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసి, ఓ కేసులో అన్యాయంగా ఇరికిస్తారని రాయ్‌ ఆరోపించారు. యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఐటీశాఖ సోదాలు చేస్తోంది. ఆర్‌సీఎల్‌ గ్రూపు ప్రమోటర్‌ మనోజ్‌ యాదవ్‌కు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. మెయిన్‌పురిలోని ఆయన ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. అయితే ఈ సోదాలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై సెంట్రల్‌ ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో నాడు కాంగ్రెస్‌ చేసిన పనే నేడు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ గత ఎన్నికల సందర్భంగా యూపీ ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చలేకపోయిందని, ప్రస్తుతం మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు సమాజ్‌వాది నేతలు, మద్దతు దారులపై సెంట్రల్‌ ఏజెన్సీలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తా మన్న హావిూని బీజేపీ నిలబెట్టు కోలేదని గుర్తుచేశారు. లౌకికత్వంతోనే రామరాజ్యం సాధ్యమని, రామరాజ్యం రావాలంటే లౌకికత్వం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.