ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునావిూ వచ్చే ఛాన్స్‌!


న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్‌ ఐలాండ్‌ లో ఈ భూకంపం సంభవించిందని..

సునావిూ వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రానికి 18.5 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది. మౌమెరే పట్టణానికి 112 కి.విూ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. కాగా, ఇండోనేసియాలో చివరగా 2004లో సునావిూ వచ్చింది. ఆ ఏడాది డిసెంబర్‌ 26న ఈశాన్య సుమత్రా దీవుల్లో సంభవించిన సునావిూలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఏడాది సంభవించిన సునావిూ దెబ్బకు ఇండోనేసియా, భారత్‌, శ్రీలంకతోపాటు మరో తొమ్మిది దేశాల్లో కలిపి సుమారు 2.30 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు.