దక్షిణాది రాష్టాల్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

ఆయా రాష్టాల్ల్రో బిజెపి బలోపేతంపై చర్చ

తెలుగు రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా వ్యూహం
న్యూఢల్లీి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  అన్ని రాష్టాల్ల్రో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ.. 2023 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే బీజేపీ అధిష్టానం కసరత్తు మొదలు
పెట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్టాల్ర బీజేపీ పార్లమెంటు సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. అయా రాష్టాల్ల్రో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటపాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.దక్షిణాది రాష్టాల్ర బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రధాని బీజేపీ ఎంపీలతో భేటీ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నివాసంలో ఎంపీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆయా రాష్టాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశర చేశారు. ప్రధానితో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, సోయం బాపూరావు హాజరవగా.. ఏపీ నుంచి జీవీఎల్‌, సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌ హాజరయ్యారు.
ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీల భేటీ సందర్బంగా.. ఎంపీ ప్రధాని మోడీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్రతుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. అయా రాష్టాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని మోడీ ఆరా తీశారు. అయా రాష్టాల్ల్రో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల సమయంలో వివిధ రాష్టాల్ర ఎంపీలకు అల్పాహార విందు ఇస్తూ వస్తున్న ప్రధాని.. బుధవారం దక్షిణాది రాష్టాల్రకు చెందన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ బలోపేతం చేసేందుకు ఆధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పాదువులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ.. దక్షిణాదిన కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్టాల్ల్రో బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటినుంచో అనుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలల్లో వలసలు చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అనుకన్నంతగా ఎంపీ సీట్లను గెలవాలని పార్టీ అధినాయత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు. వివిధ రాష్టాల్ర ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోడీతో ఎంపీల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.