రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు


` పథకం అమలును వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
` అధికారులతో మంత్రి, సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌
` 118 నియోజకవర్గాల్లో రూ.1200 కోట్లతో అమలుకు కసరత్తు
హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):దళితబంధు పథకం అమలును తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ వేగవంతం చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాగా, మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ శ్రీనివాస్‌, బీ.ఆర్‌.కె ఆర్‌ భవన్‌ నుండి సి.ఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో దళితబంధు పధకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్‌ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 100 శాతం గ్రౌండిరగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంచార్జ్‌ మంత్రులతో ఆమోదింప చేయాలని సూచించారు. ప్రతీ లబ్దిదారుడికీ ఏ విధమైన బ్యాంకు లింకేజి లేకుండా 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. లబ్ది దారుడు కోరుకున్న యూనిట్‌ నే ఎంపిక చేయాలని సూచించారు.ఒక్కొక్క లబ్దిదారుడికి మంజూరైన రూ.10 లక్షలనుండి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బందుకు రూ. 1200 కోట్ల కేటాయించామన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లను విడుదల చేసామని తెలిపారు. విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి.. ఇప్పటికే, వాసాల మర్రి, హుజురాబాద్‌ లలో దళిత బంధు అమలు లో ఉందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమల గిరి మండలం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలాల్లో కూడా అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1200 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామని, విడతల వారీగా మిగతా నిధుల విడుదల చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్క లబ్దిదారుడికి మంజూరైన రూ.10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేక దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాలని కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు.మార్చి నెలలోగా ఆయా నియోజకవర్గాల్లో వంద కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంఛార్జి మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు.ప్రతి లబ్దిదారుడికి బ్యాంకు లింకేజి లేకుండా పది లక్షల రూపాయల ఆర్థికసాయంతో కోరుకున్న యూనిట్‌?నే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో లబ్దిదారుడికి మంజూరైన పది లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించి అందులో ఇప్పటికే వంద కోట్లు విడుదల చేశారు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయనున్నారు