అమెరికాలో కోటిమంది బాలలకు కరోనా


వెల్లడిరచిన సర్వే నివేదికలు

వాషింగ్టన్‌,జనవరి27(జనం సాక్షి): అమెరికాలో కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కోటి మందికి పైగా చిన్నారులు కోవిడ్‌ బారినపడ్డారు. అమెరికా పిల్లల వైద్యుల అకాడవిూ, బాలల ఆస్పత్రి సమాఖ్య సంయుక్త నివేదికలో ఈ విషయం వెల్లడిరచారు. ఆ నివేదిక ప్రకారం..జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 1,06,03,034 మంది చిన్నారులకు కోవిడ్‌ నిర్దారణైంది. మొత్తం కోవిడ్‌ కేసుల్లో ఇది 18.4 శాతం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ తలెత్తినప్పటి నుండి పిల్లల్లో గణనీయంగా కేసులు పెరిగాయి. గత వారంలో 11 లక్షల మందికి పైగా పిల్లలు కోవిడ్‌ బారిన పడ్డారు. గత శీతాకాలంలో నమోదైన కేసుల కన్నా ఇది ఐదు రెట్లు ఎక్కువ. గత రెండు వారాల్లోనే 20 లక్షల మందికి పైగా పిల్లలు కోవిడ్‌ బారిన పడ్డారు. సెప్టెంబరు మొదటి వారానికి పిల్లలకు సంబంధించి 56 లక్షల కేసులు వుండేవి. ఇప్పడవి కోటి దాటి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.