ఉపాధ్యా,రైతు కుటుంబాలకు రేవంత్‌ పరామర్శ

317 జివోపై కొట్లాడుతామని ప్రకటనస

రైతు కుటంబానికి25వేల ఆర్థికసాయం అందచేత
మహబూబాబాద్‌,జనవరి29 (జనంసాక్షి): బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్‌ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్‌ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. జీవో 317 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం పర్వతగిరిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు సంపత్‌ కుటుంబాన్ని పరామర్శించారు.ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా సంధ్యతండాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఇటీవల గుండెపోటుతో చనిపోయిన ఉపాధ్యాయుడు జేత్రామ్‌ కుటుంబాన్ని పరామర్శించారు.బదిలీల్లో భాగంగా మనస్తాపం చెందిన జేత్రామ్‌.. ప్రాణాలు కోల్పోయారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 వల్ల స్థానికతపై గందరగోళం నెలకొందన్నారు. కావాలానే తెరాస, భాజపా సమస్యను జటిలం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో జీవో 317 అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలమంతా ప్రస్తావిస్తామని వెల్లడిరచారు. ఓట్లేసిన ప్రజలను నమ్ముకుని కాకుండా.. పోలీసులను నమ్ముకుని తెరాస ప్రభుత్వం పరిపాలన చేస్తోంది. జీవో 317 ప్రవేశపెట్టి.. ఉపాధ్యాయ ఉద్యోగులను వేరే
వేరే జిల్లాలకు బదిలీలు చేసి వారికి స్థానికత అనేది లేకుండా చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేసి వ్యవహరిస్తున్నాయి. జీవో 317పై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావన తెస్తానని అన్నారు. అనంతరం పర్వతగిరిలో రేవంత్‌ రెడ్డి పర్యటించారు. పంట నష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన మిరప రైతు సంపత్‌ కుటుంటాన్ని రేవంత్‌ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.