మే 11 నుంచి టెన్త్‌ పరీక్షలు

 


షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ
హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వ విద్యాశాఖ వివరాలు వెల్లడిరచింది. రెగ్యులర్‌ ఎస్‌ఎస్సీ, ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ రెగ్యులర్‌, ప్రైవేటు ఎస్‌ఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. రెగ్యులర్‌ విద్యార్థులకు మే 11 నుంచి మే 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మే 18న ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2(సంస్కృతం, అరబిక్‌), మే 20న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్స్‌(థియరీ) పరీక్షలు జరగనున్నాయి.