తెలంగాణ ఎదుగుదలను ఓర్వని ప్రధాని మోడీ

 


విభజనను రాజకీయంచేయడం దారుణం
ఏడేళ్లుగా ఏ ఒక్క హావిూని నెరవేర్చని ప్రధాని
బిజెపి తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు
పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలపై హరీష్‌ మండిపాటు
2004లో ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని ప్రశ్న
సిద్దిపేట జిల్లాలో పలుకార్యక్రమాలకు శ్రీకారం
సిద్దిపేట,ఫిబ్రవరి8( జనంసాక్షి): తెలంగాణ ఎదుగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణపై ఉన్న కక్ష ఏపాటిదో ఆయన ప్రసంగంలోనే అర్థం అయ్యిందన్నారు. ఏడేళ్లుగా తెలంగాణకు ఏవిూచేయక పోగా..విభజన హామలు అమలు చేకపోగా.. అసలు విభజననే తప్పుపట్టడం ఆయన దిగజారుడు తనానికి అద్దం పట్టిందని మండిపడ్డారు. మంగళవారం నాడు సిద్దిపేటజిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌ ప్రారంభించారు. తొలుత అక్కన్నపేట మండలం పోతారంలో దళితబంధు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్బంగా పార్లమెంట్‌లో తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్టాల్రు కలిసి ఉంటే ప్రధాని మోడీకి నచ్చట్లేదని విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణపై ఆయన అక్కసు ఇంకా పెరుగుతోందన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలను పవర్‌ ప్లాంట్‌ను ఆంధ్రాలో కలిపింది మోదీనే అని దుయ్యబట్టారు. ఇవాళ తెలంగాణ ఏర్పాటుపై అక్కసు
వెళ్లగక్కుతున్నారు.. నాటీ బీజేపీ ప్రభుత్వం 2004 లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగి ఉండేవా?‘ అని ప్రశ్నించారు. వందలాది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌, బీజేపీలే కారణం అని నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు ఎరువుల ధరలను పెంచడమే కాకుండా.. వ్యవసాయ బావుల వద్ద కరెంటు విూటర్లను బిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ గొంతులో ప్రాణం ఉండగా వ్యవసాయ బావుల వద్ద కరెంట్‌ విూటర్‌ లను బిగించనీయమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి వివక్ష ప్రదర్శించారని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవడం వివక్షకు నిదర్శనం కాదా అన్నారు. ఇప్పటివరకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. కరెంట్‌ విూటర్లు పెడితేనే అంటూ మెలికలు పెడుఉతన్న కేంద్రం తీరును తప్పుపట్టారు. ఇక దళితులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని హరీష్‌ రావు పేర్కొన్నారు. దళితులు ఆగమాగం కాకుండా మంచి యూనిట్‌ను ఎంచుకుని ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఆ తరువాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఇంజనీర్‌ నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ తో కలిసి ప్రారంభించారు మంత్రి హరిష్‌ రావు. అనంతరం పక్కనే ఉన్న మైదానంలో సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో మంత్రి పాల్గొన్నారు. ఆ తరువాత వైద్య విధాన పరిషత్‌లో కలవనున్న హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులతో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇప్పటివరకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒకటే అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఇంజనీర్‌ నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్‌ లో రూ.1.71 కోట్ల రూపాయలతో విద్యుత్‌ డీఈ కార్యాలయం ప్రారంభం చేసుకున్నాం. హుస్నాబాద్‌ పరిసర ప్రాంత ప్రజలు గతంలో కరీంనగర్‌, సిద్దిపేట వెళ్లే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఇక నుంచి ఏలాంటి విద్యుత్‌ సమస్య పనులకు హుస్నాబాద్‌ లోనే చేసుకునే వెసులుబాటు కలిగింది. డీఈ అధికారి పోస్టు మంజూరుతో పాటు నూతన భవన ప్రారంభం చేసుకున్నాం. అలాగే హుస్నాబాద్‌ నాగ సముద్రాల వద్ద 220/132 కేవీ సబ్‌ స్టేషన్‌ గతంలో మంజూరు చేసుకున్నామని, పనులు పూర్తి కావొచ్చాయని, రూ.50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సబ్‌ స్టేషన్‌ ను మార్చి 31వతేది లోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డిలకు మంత్రి ఆదేశించారు. అదే విధంగా నూతనంగా నిర్మిస్తున్న రామవరం, సీసీ పల్లి సబ్‌ స్టేషన్‌ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రామవరం సబ్‌ స్టేషన్‌ మార్చి 31లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్జడెట్లో రైతులకు ఏమైనా మేలు చేస్తుందోనని ఎదురు చూస్తే.. కేంద్రం వైఖరి రైతులపై భారం వేయడం తప్ప, రైతులకు మేలు చేసిందేవిూ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్‌ డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 3.5 శాతం రాష్టాలకు నేరుగా ఇస్తామని, మరో ఒక అర శాతానికి విద్యుత్‌ సంస్కరణలు తేవాలని నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్తు చట్టంలో సవరణల పేరుతో బాయిలకాడ విద్యుత్‌ విూటర్లు పెట్టాలని, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను ప్రయివేటు పరం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని కేంద్రం పై మంత్రి హరీశ్‌ విమర్శలు చేశారు.
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయిలకాడ విూటర్లు పెట్టనని కెసిఆర్‌ తెగేసి చెప్పారని అన్నారు. విూటర్లు పెడితే అరశాతం 5 వేల కోట్లు మన రాష్టాన్రికి రానట్లేనని, దీంతో తెలంగాణకు 5 వేల కోట్ల కోత పడినట్లేనని ఆర్థిక మంత్రి హరీశ్‌ వెల్లడిరచారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఏవిూ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నది. ఎందుకు ఈ నిబంధనలంటూ.. మా రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మా రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు బాయిలకాడ, బోర్లకాడ ఇస్తున్నట్లు, గత ఏడేండ్లుగా అందిస్తున్నట్లు, ఇందుకోసం యేటా 12 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని., కానీ కేంద్ర బీజేపీ విద్యుత్తు సంస్కరణలు తేవాలని రాష్టాల్రమెడలపై కత్తి పెడుతున్నదని మండిపడ్డారు.
ఒకప్పుడు 400 రూపాయలు గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని, కేవలం యేడాది ఇచ్చి యేటా 6 సార్లు 2400 వరకూ ఇచ్చినట్లే ఇచ్చి, ఇవాళ 40 రూపాయలకు బీజేపీ దిగజారిందని విమర్శించారు. విద్యుత్‌ పంపిణీని ప్రయివేటు పరం చేయడమేనంటూ.. రైతులకు విూటర్లు పెట్టడమే బీజేపీ విధానమని మంత్రి హరీశ్‌ వెల్లడి ఎఫ్‌ సీఐకి సైతం కోత పెట్టినట్లు, రైతులు పండిరచిన ధాన్యం సేకరించే సబ్సిడీలో దాదాపు 40 వేల కోట్ల రూపాయలు కోత పెట్టినట్లు చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పకనే కేంద్రం చెబుతున్నదని కేంద్ర బీజేపీపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచినట్లు వాపోయారు. ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందని.., ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్‌ ఎరువులకు ధరలు పెంపు చేశారని, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ది పొందేలా.. ఉత్తర దేశానికి ఒకనీతి, దక్షిణ దేశానికి ఒకనీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్‌ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై ఎంత వివక్ష చూపుతుందో.. తెలిసేందుకు కేవలం ఇదొక ఉదాహరణ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు పూర్తికాగానే డీజీల్‌, పెట్రోల్‌ ధరలు పెంపు చేస్తారని..అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధానాలు అవలంభించడం ద్వారా కేంద్రం ఆదుకోకపోయినా.. వివక్ష చూపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏవిూ చేయకుండానే బీజేపీ సోషల్‌ విూడియా ఫేక్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, ప్రతీ యేటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతుభీమా.. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇస్తున్నారా.. అంటూ చెప్పుకొచ్చారు. బట్టేబాజ్‌, జూటే బాజ్‌ పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేవిూ లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.