సత్వరమే ఎస్సీ,ఎస్టీ కేసుల పరిస్కారం

 


బాధితలకు తక్షణం సాయం అందేలా చూడాలి
అధికారులతో సవిూక్షలో కలెక్టర్‌ ఆదేశాలు
నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం
అయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ హాల్లో అధికారులతో సమావేశమై జిల్లాలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్‌, భూ పరిహారం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై సవిూక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో2014సంవత్సరం నుండిఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండిరగ్‌ లో వున్నాయని, సంబంధిత కేసులు సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, అలాగే బాధితులకు మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్‌, భూ పరిహారం, ఉద్యోగ నియామకాల పక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, అధికారులను ఆదేశించారు.2019, 2020, 2021సంవత్సరాలల్లో నమోదైన13కేసులకు సంబంధించి బాధితులకు భూ పరిహార పంపిణీ పెండిరగ్లో వుందని, అలాగే ఈ13కేసులకు సంబంధించి11మంది బాధితులకు కారుణ్య నియామకాలు చేపట్టాల్సివుందని, ఈ నెలాఖరు నాటికి బాధిత కుటుంబాలకు భూ పరిహారం, కారుణ్య నియామకాల పక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, రెవిన్యూ అధికారులను ఆదేశించారు.ప్రతి నెల పెండిరగ్లో వున్నా ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులతో సమావేశమై పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, డి.ఆర్‌.ఓ ను ఆదేశించారు. జిల్లాలో నమోదైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు సకాలంలో పరిహారం చెల్లించినప్పుడే వారికి న్యాయం చేకూర్చినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్‌, అధికారులకు సూచించారు. జిల్లాలో నమోదైన ప్రతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎఫ్‌.ఐ.ఆర్‌ కాపీని 24గంటల లోపు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంనకు పంపడంతో పాటు ఎఫ్‌.ఐ.ఆర్‌ ఫైల్‌ చేసిన అన్ని కేసులకు చార్జిషీట్లు త్వరగా వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) రోజ్‌ మాండ్‌, జిల్లా రెవిన్యూ అధికారి చిన ఓబులేసు,సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చెన్నయ్య, ఎస్‌.డి.పి శ్రీనివాసరావు, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జగదీష్‌,కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.