డిజిపి గౌతం సవాంగ్‌ ఆకస్మిక బదిలీ


కొత్త డిజిపిగా సిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి నియామకం
జిఎడిలో రిపోర్ట్‌ చేయాలంటూ సవాంగ్‌కు ఆదేశాలు
విజయవాడ ఉద్యోగుల ముట్టడితోనూ పదవికి ఎసరంటూ ఊహాగానాలు
అమరావతి,ఫిబ్రవరి15( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటుపడిరది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న గౌతం సవాంగ్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. పోలీసు హౌజింగ్‌ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. గౌతం సవాంగ్‌కు 2023 వరకు సర్వీస్‌ ఉన్నప్పటికీ బదిలీ కావడం ఏపీ పోలీసు వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఇటీవల అనేక నిర్ణయాల్లో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయనను తప్పించికొత్త డిజిపిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం... లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్‌ను బదిలీ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయానికి వచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవిూర్‌ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. దీనిలో భాగంగా రాజేంద్రనాథ్‌ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీజీపీగా నియాకమైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు. మే 2020 నుండి ఈ పదవిలో ఉన్న రాజేంద్రనాధ్‌ రెడ్డి.. గతంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌ ఐజీగా, ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా సేవలందించారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డైరెక్టర్‌ జనరల్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ప్రభుత్వ ఎక్స్‌`అఫీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంఆ వంటి పదవులను నిర్వహించారు. దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌గా మే 2019న నియామకం అయ్యారు. ది బెటర్‌ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో 2021 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా సవాంగ్‌ ఎంపికయ్యారు. గౌతమ్‌ సవాంగ్‌ 10 జులై 1963న జన్మించారు. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలో వివిధ ప్రాంతాల్లో సేవలు అందించారు. ఈ క్రమంలో గౌతమ్‌ సవాంగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్‌, త్రిపుర, ఢల్లీిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.
చెన్నై లయోలా కాలేజీలో డిగ్రీ, డిల్లీ యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నారు. గౌతమ్‌ సవాంగ్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. చిత్తూరు జిల్లా మదనప్లలె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభం అయ్యింది. చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా ,2001 నుండి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. 2003 నుండి 2004 వరకు ఎస్‌ఐబీ డీఐజీ,2004 నుండి 2005 వరకు ఏపీఎస్పీ పటాలం డీఐజీగా బాధ్యతలు, తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్‌పై వెళ్ళిన సవాంగ్‌ 2005` 2008
వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేశారు. 2008 నుండి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పని చేసిన ఆయన 2016లో డీజీగా పదోన్నతి అందుకుని 2018 వరకు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. 2018 జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పని
చేస్తూ 3 ఆగష్టు 2019న ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా నియామకం అయ్యారు.