ఆఖరుకు తెలంగాణకు సమ్మతించింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే




కేసీఆర్ నాయకత్వాన భారత పార్లమెంటులో 36 పార్టీల సమ్మతిని తీసుకున్నాం

దేశంలో అన్నీ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాక అనివార్య పరిస్థితులలో అందరికన్నా ఆఖరుకు సమ్మతించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 

అనివార్య పరిస్థితులలో ప్రజల పోరాటానికి తలొగ్గి విధిలేక 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇవ్వదనుకుని బీజేపీ తర్వాత ఎలాగైనా దాటవేయొచ్చని మేమొస్తే నూరు రోజులలో తెలంగాణ ఇస్తామన్నారు

కానీ తెలంగాణ ప్రజల అదృష్టం, కేసీఆర్ నాయకత్వాన పెరిగిన వత్తిడి, ఆమరణ నిరాహార దీక్ష, వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలు, అన్నీ వెరసి తెలంగాణ సమాజం గిరిగీసి నిలబడడంతో తెలంగాణ ఇవ్వకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారు


అనేక రకాల చర్చోప చర్చలు జరిగాయి .. శాసనసభలో చర్చలు జరిగాయి .. చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్యల పాలనలో చర్చలు జరిగాయి

పార్లమెంటు, అఖిలపక్షాల భేటీలో , జేఏసీలో, శ్రీ కృష్ణ కమిటీ పర్యటనలో చర్చలు జరిగాయి 

ఇవన్నీ అయ్యాక పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యింది

ఇన్ని జరిగాక వచ్చిన బిల్లును మోడీ అవమానించి తన అజ్ఞానం బయటపెట్టకున్నారు .. ఇది దేశానికి మంచిది కాదు

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయి అద్భుతంగా పురోగమిస్తున్నాం .. దేశంలో అనేక రంగాలలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది

ఇంత అద్భుతంగా పురోగమిస్తుంటే ఒకనాడు బిడ్డను కని తల్లి చనిపోయిందన్నాడు .. ఇప్పుడు తలుపులు మూసి లైట్లు ఆర్పి బిల్లు ఆమోదించారు అంటున్నాడు

దమ్ముంటే విభజన చట్టం తప్పు అనుకుంటే చీము, నెత్తురు, రోషం ఉంటే దానికి ప్రత్యామ్నాయం పార్లమెంటులో పెట్టాలి

మోడీది తెలంగాణ అభివృద్ది పట్ల ఒక ఈర్ష, ద్వేషం, ఒక అసూయ. 

కారణం ఒక్కటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగున పరిచి, ఏక వ్యక్తి పరిపాలన కింద ఏకవ్యక్తిగా చలామణి అవుతున్న మోడీ మోనార్క్ లా దేశాన్ని ఏలాలని అనుకుంటున్నాడు

మోడీ రాచరికపు ఆలోచనా విధానానికి గండి కొట్టే సాహసం చేస్తున్నది ఒక్క కేసీఆర్

అందుకే తెలంగాణ మీద కసిబూని మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారు

ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారు .. దానిని మరిచిపోయిన పాలకులు ప్రజల పాదాల ధూళికింద కలిసిపోతారు

దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రాలన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమే

తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులలో దేశంలో కలిసింది

బీజేపీ పార్టీకి తెలంగాణ మీద అవగాహన లేదు

బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేశారు

అప్పటి నుండి తెలంగాణ అనేక రూపాలలో ఉద్యమాలు చేస్తూ బిడ్డలను కోల్పోతూ రక్తతర్పణం చేస్తూ వచ్చింది

భూగోళంలో ఒక ప్రాంత ప్రజలు స్వీయ అస్తిత్వం కోసం మాది మాగ్గావాలని కోరిన ఏకైక ప్రాంతం తెలంగాణ ప్రాంతం

తెలంగాణ విశిష్టత, ప్రాధాన్యం వేరు

66 ఏళ్ల సుధీర్ఘ పోరాటంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల పాత్ర రవ్వంత లేదు

ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాకినాడ తీర్మానంతో డ్రామాలు చేసింది బీజేపీ .. ఆ తర్వాత మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణను విస్మరించారు.రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .