జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ఆర్మూర్, హెచ్ ఎం మంజుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం




పాఠశాల(ఎస్ఏంసి) కమిటీ చైర్మన్ గా పొన్నాల చంద్రశేఖర్ నియమకం

జనం సాక్షి ఆర్మూర్ రూరల్:-21
 జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం సోమవారం నిర్వహించారు. 
ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయురాలు మంజుల మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే పాఠశాలలో ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలు సేకరించి ఒక తరగతి నుండి ముగ్గురు వ్యక్తులను (ఎస్ ఏం సి) కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే నూతన (ఎస్ఏంసి) కమిటీ చైర్మన్ గా పొన్నాల చంద్రశేఖర్ ని నియమించారు. 
పాఠశాల అభివృద్ధికి మరియు ప్రతి నెల మొదటి వారంలో తల్లిదండ్రులతో సమావేశం, అనంతరం పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో కమిటీ సభ్యులు ముందుండాలని నెలకు ఒకసారి జరిగే సమావేశంకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె కోరారు. 
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇకపై కార్పొరేట్ స్థాయి వసతులు సమకూరనున్నాయని మొన్నటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ ఆదేశానుసారంగా నేడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఆలాగే ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం ఇందుకు దోహద పడనుందని పేర్కొన్నారు. పాఠశాల ఉపాద్యాయుల బృందం, (ఎస్ఏంసి) కమిటీ సభ్యులు సహకారంతో పాఠశాల అభివృద్ధి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చి విద్యా బోధన మరింతగా మెరుగుపడబోతోందని అన్నారు. మన ఊరు - మన బడి/మన బస్తీ - మన బడి కార్యక్రమం అమలు తీరు, విధివిధానాల గురించి (ఎస్.ఏం.సి) కమిటీ ఛైర్మన్ పొన్నాల చంద్రశేఖర్ వివరించారు. ఇందులో ముఖ్యంగా పాఠశాల సమస్యల పట్ల పరిష్కరించే దిశలో మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రధానంగా విద్యుత్ సమస్యతో పాటు ఇతర ఇతర సమస్యలు పాఠశాలలో నెలకొన్నాయని వాటిని పరిష్కరించే దిశ లో ముందుండాలని పాఠశాల (ఎస్.ఏం.సి) కమిటీ ఛైర్మన్ పొన్నాల చంద్రశేఖర్ పేర్కొన్నారు.ఈ క్రమంలో పాఠశాల కమిటీ నూతన చైర్మన్ పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేటి సమాజం లో ప్రతి కుటుంబం విద్య , వైద్యం పైనే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రస్తుతం మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసుకుంటే విద్యపై ప్రజలు వెచ్చిస్తున్న డబ్బులను వారికి ఆదా చేసినట్లు అవుతుందన్నారు. అంతేకాకుండా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్యను అభ్యసించి చక్కటి భవిష్యత్తును ఏర్పర్చుకుంటారని పాఠశాల చైర్మన్ పొన్నాల చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాపై పూర్తి నమ్మకం ఉంచిన పాఠశాల కమిటీ సభ్యులకు అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు బృందం కు ధన్యవాదాలు తెలిపారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని పాఠశాల నిర్వహణ కమిటీలు , హెచ్ఎం తో పాటు గ్రామ స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగస్వామ్యమై క్రియాశీలక పాత్ర పోషిస్తూ, దీని విజయవంతానికి కృషి చేయాలని HM మంజుల కోరారు. దీని ఔన్నత్యాన్ని గుర్తెరిగి సానుకూల దృక్పధంతో తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని హితవు పలికారు. బడులలో అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే లక్షలకు పైగా రూపాయల వరకు నిధులను మంజూరు చేసే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఎస్ ఎం సి కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో అవసరమున్న పనులను గుర్తించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ కమిటీలు పక్షంలో వాటిని వెంటనే ఏర్పాటు చేసుకుని పరిష్కారమై దిశలో వెళ్దాం అన్నారు.వచ్చే గురు వారం నాటికి ఎస్ఎంసి కమిటీ సభ్యు లకు శిక్షణ పూర్తి చేసుకోవాలని,పూర్వ విద్యా ర్థులు కమిటీని ఏర్పాటు చేసుకుని,నిధులు వెచ్చింపు కోసం రెండు వేర్వేరు బ్యాంకు జాయింట్ అకౌంట్ల ను తెరవాలని సూచించారు. మన ఊరు - మన బడి కింద ప్రభుత్వం కేటాయించే నిధుల తో 12 రకాల పనులు చేపట్టాలని, పూర్వ విద్యార్థు లు కమిటీ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాల నిధులతో ఇతర అభివృద్ధి పనులు చేపట్టవచ్చని వివరించారు. ఏదైనా పాఠశాలకు దాతలు రెండు లక్షల రూపాయల విరాళం అందిస్తే పాఠశాల నిర్వహణ కమిటీలో వారికి ప్రాతి నిధ్యం కల్పిస్తామని తెలిపారు. పాఠశాలలో ఇప్పటికే కమిటీల తోడ్పాటుతో పాఠశాల చక్కగా కొనసాగుతున్నాయని అన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలోనూ వారి సహకారం తీసుకుని సర్కారీ బడులను బలోపేతం చేస్తామన్నారు. కాగా మన ఊరు - మన బడి కింద వెచ్చించే నిధులు,చేపట్టే ప్రతి పనిపై సామాజిక తనిఖీ తప్పనిసరిగా జరుగుతుందని స్పష్టం చేశారు. బడులలో అవసరమైన పనులను మాత్రమే గుర్తిస్తూ,నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. డిజిటల్ బోధనకు అవసర మైన సామాగ్రి, ఫర్నిచర్, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ కు అవసరమైన సామాగ్రిని స్థానికంగా కొనుగోలు చేయకూడదని ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు . ఏంటో ప్రయోజన కరంగా నిలిచే మన ఊరు - మన బడి కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ చక్కటి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని హెచ్ ఎం మంజుల కోరారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, నూతన (ఎస్ఎంసి) కమిటీ చైర్మన్ పొన్నాల చంద్రశేఖర్, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.