రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం


సమతామూర్తి దర్శనంతో తనలో చైతన్యం పెరిగింది

సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినా ఆగడం లేదు
ముచ్చింతల్‌ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా
స్వాగతం పలికి వివరాలు వెల్లడిరచిన చినజీయర్‌ స్వామి
హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సమతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగించారు. . స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ప్రతిమను దూరంనుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందన్నారు. రామానుజా చార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందన్నారు. సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది. సనాతన ధర్మం యాత్ర ఆగిపోదు.. ప్రపంచమంతా విస్తరిస్తుంది.సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు
సాగుతున్న చిన్నజీయర్‌ స్వామికి నా అభినందనలు. నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాధు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను దిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారని గుర్తు చేశారు. రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారు. రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహాతొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయి. ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారు. వినమ్రత, సంస్కరణకోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్దరణ పక్రియ ఆవిష్కారమవుతుంది. దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. సాయంత్రం హైఊదరాబాద్‌ వచ్చినకేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు. మంగళవారం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్‌ షా.. ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్‌ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్‌ షా పాలుపంచు కున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, బిజేపి సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, సైబరాబాద్‌ కవిూషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఘన స్వాగతం పలికారు.