పంజాబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చన్నీ


` ప్రకటించిన రాహుల్‌ గాంధీ
దిల్లీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ఉత్కంఠకు తెరపడిరది. కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంజాబ్‌ సీఎం ఎవరనేదానిపై సందిగ్ధత వీడిరది. సీఎం అభ్యర్థిని ఆ పార్టీ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ ఆదివారం ప్రకటించారు. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీనే సీఎం అభ్యర్థిగా రాహుల్‌ ఎన్నుకున్నారు. లూధియానాలో నిర్వహించే ర్యాలీ సందర్భంగా అభ్యర్థిని ప్రకటించారు.ప్రస్తుత అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో.. కాంగ్రెస్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింద్‌ సిద్ధూ మధ్య పోటాపోటీ నెలకొంది. ఈనేపథ్యంలోనే ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ (ఐవీఆర్‌) ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. చన్నీ వైపే మొగ్గుచూపింది.సీఎం అభ్యర్థిత్వంపై చన్నీ, సిద్ధూ మధ్య పొరపొచ్చాలు తలెత్తిన విషయం తెలిసిందే. అధిష్ఠానం వీరిద్దరికి సర్దిచెప్పడంతో.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువురు పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని రాహుల్‌ ప్రకటించే కొన్ని గంటల ముందు సిద్ధూ పలు ట్వీట్లు చేశారు. ‘స్పష్టమైన నిర్ణయం లేకుండా గొప్పదేదీ సాధించలేం. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై పంజాబ్‌కు క్లారిటీ ఇవ్వడానికి వచ్చిన మా మార్గదర్శి రాహుల్‌ గాంధీకి హృదయపూర్వక స్వాగతం. ఆయన నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం!’ అని రాసుకొచ్చారు.