నగరంలో సవిూప జిల్లాల ఆటోలపై చలాన్లు


భారీగా వసూళ్లు చేస్తూ బెదరిస్తున్నారు

పిసిసి చీఫ్‌ రేవంత్‌ దృష్టికి ఆటోవాలాల సమస్య
అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హావిూ
హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఇతర ప్రాంతాల ఆటోలను గ్రేటర్‌ హైదరాబాద్‌లో తిరగనివ్వట్లేదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఇతరప్రాంత ఆటోలపై జరిమానాలు వేస్తున్నారని విన్నవించుకున్నారు. డీజిల్‌ ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాగా ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్‌... పరిష్కారానికి కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంతమంది తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ సాగర్‌ రింగ్‌ రోడ్డు సవిూపంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆటోలను నగరంలో తిరగకూడదని ఆదేశాలు జారీ చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. తమ పర్మినెంట్‌ చిరునామా గ్రామాల్లో ఉండటంతో అక్కడి అడ్రస్‌ విూదనే ఆటోలు కొనుగోలు చేసి, ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్టేష్రన్‌ చేయించుకున్నామని వారు వెల్లడిరచారు. తమ ఆటోలకు నగరంలో అనుమతి లేనప్పుడు అధికారులు విూటర్‌ రీడిరగ్‌ సీజింగ్‌తో పాటు సీరియల్‌ నంబర్‌ ఇచ్చి స్టిక్కర్లు ఎందుకు అతికించారని ప్రశ్నించారు. ఇతర రాష్టాల్ర దేశాల వాహనాలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నగరానికి ఆనుకోని ఉన్న జిల్లాల నుంచి వచ్చే
ఆటోలను అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర జిల్లాల ఆటోలకు అనుమతి ఉండదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని తమ ఆటోలను నగరంలో తిరగనివ్వాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని శనివారం డీజిల్‌ ఆటో డ్రైవర్లు కలిశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ఆటోలను తిరగనివ్వడం లేదని రేవంత్‌రెడ్డి దృష్టికి ఆటో డ్రైవర్లు తీసుకొచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బయట రిజిస్టేష్రన్‌ ఆటోలు తిరిగితే వేలాది రూపాయలుఫైన్లు వేస్తున్నారని డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని రేవంత్‌రెడ్డి హావిూ ఇచ్చారు.