సింగరేణి ప్రవేటీకరణకు కేంద్రం కుట్ర


` సెగ ఢలీికి తగులుతుంది..జాగ్రత్త!
` సింగరేణిని దెబ్బతీస్తే.. భాజపా కోలుకోని విధంగా దెబ్బతింటుంది
` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక
` కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఘాటైన లేఖ
హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. సింగరేణి జోలికి వస్తే ఢల్లీి తల్లడిల్లాల్సిందే అని, బీజేపీపై మరో ఉద్యమం తప్పదు ఆయన తేల్చిచెప్పారు. అది కోల్‌ మైన్‌ కాదు.. గోల్డ్‌ మైన్‌ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి కేటీఆర్‌ ఘాటైన లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో అభివృద్ధి ప్రస్థానంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న సింగరేణి జోలికి వస్తే మసికాక తప్పదని హెచ్చరించారు. నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం..నేడు నల్లబంగారం పై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్‌ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్‌ హెచ్చరించారు. సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢల్లీికి తాకడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. సింగరేణిలో ఉన్న జెబిఅర్‌ఒసి `3, కేకే `6, శ్రవనపల్లీ ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించి.. ఆ మేరకు ముందుకు పోవడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయిం చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు ఒక ఘాటైన లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పి ఎల్‌ ఎఫ్‌ ను కలిగి ఉందన్నారు. కేవలం సింగరేణి రాష్టాన్రికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్టాల్లోన్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తూ దేశానికి విద్యుత్తు కాంతులను విరజిమ్ముతున్నదన్నారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్టాల్లోన్రూ తన కార్యకలాపాలను విస్తరిస్తూ సింగరేణి ప్రగతి ప్రస్థానంలో దూసుకెళ్తున్నదని మంత్రి తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఏకైక సంస్ధ సింగరేణి అని కేటీఆర్‌ తెలిపారు. దీంతోపాటు కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్ధ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, సింగరేణి కార్మిక బిడ్డల కృషితో ఇంతకాలం కార్మికులకు లాభాల్లో వాటాలు అనేది పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయని, సంస్థను ప్రైవేటుపరం చేస్తే, ఇకనుంచి నష్టాల మూటలు అనేవి ప్రధాన శీర్షికలు అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పక్క రాష్ట్రం అంద్రప్రదేశ్‌ లోనూ ఇదేవిధంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్‌ ఓర్‌ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరిం చేందుకు రంగం సిద్దం చేసిందన్నారు కేటీఆర్‌. కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 27 దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న సింగరేణికి సైతం బొగ్గు గనులు లేకుండా చేసి సంస్ధను చంపే కుట్రకు తెరలెపిందని కేటీఆర్‌ అన్నారు. మరోవైపు గుజరాత్‌ రాష్ట్రంలో మాత్రం అడిగిన వేంటనే లిగ్నైట్‌ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌ మెంట్‌ సంస్ధకు
కేటాయించినట్టు, తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానం ఉందన్నారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ట్రం కాదా ప్రశ్నించారు. ఇదీ కేవలం సింగరేణి సంస్ధపై మాత్రమే వివక్ష కాదని, ఇది తెలంగాణ రాష్ట్రంపై వివక్ష అన్నారు. కేంద్రం కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ కుట్రలను అపకుంటే తగిన బుద్ది చెబుతారు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ªుంగరేణి అంటే కోల్‌ మైన్‌ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్‌ మైన్‌ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 16వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దళితులు, బహుజనులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దండయాత్రగా మంత్రి అభివర్ణించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడవడమేనని, రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతంత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ యువతకు ఉద్యోగాల గని, సింగరేణి అని కేటీఆర్‌ స్పష్టంచేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని, ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంటుందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని అవకాశాలు పోతాయన్నారు. అంతిమంగా సింగరేణి సంస్థ సవిూప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలుకు బొగ్గు అందుతుందని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటీకరణ అయితే ఆయా పరిశ్రమ లకు బొగ్గు సరఫరా అందడం ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లోకి, వెళ్లి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుందన్నారు. మా దృష్టిలో కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్‌ లో వేలం వేస్తోందని విమర్శించారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో విరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్‌ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని పోతాయని.. అంతిమంగా సింగరేణి సంస్థ సవిూప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు..