హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేసులో తానున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ను మార్చాల్సిన అవసరం లేదని, దీనిపై ఏఐసీసీ నేత రాహుల్గాంధీకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఉత్తమ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని, ఎంపీ రేవంత్రెడ్డి, పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారని, నన్నడిగితే ఇవ్వొద్దని చెబుతానని చెప్పారు. తన అభ్యంతరాలను నేరుగా రేవంత్రెడ్డికే చెబుతానని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డికి పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకుందని జగ్గారెడ్డి చెప్పారు. ఉత్తమ్పై రేవంత్రెడ్డి ఫేస్బుక్ టైగర్లు దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్లో ప్రభుత్వ కోవర్టులు ఉన్నారని వెల్లడించారు. కుంతియా దగ్గరున్న ఇద్దరు నేతలు కోవర్టు పనులు చేస్తున్నారని, ప్రభుత్వం తనను రాజకీయంగా ఇబ్బంది పెడితే.. తన కూతురు రాజకీయాల్లోకి వస్తుందని జగ్గారెడ్డి తెలిపారు.
పీసీసీ చీఫ్ రేసులో నేనూ ఉన్నాను:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి