ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్‌ అండర్‌పాస్ ప్రారంభం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్‌ అండర్‌పాస్‌, కామినేని జంక్షన్‌లో కుడివైపు నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.


ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌కు, సాగర్‌ రింగ్‌ రోడ్డు నుంచి నాగోల్‌ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. అండర్‌పాస్‌తో ఓవైసీ జంక్షన్‌, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రూ. 14 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టారు. కామినేని జంక్షన్‌లో రూ. 43 కోట్లతో ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. మొత్తానికి ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌గా మారింది.