యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌2  జనం సాక్షి :  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం సర్వేషామేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు స్వామి వారి బాలాలయంలో అతరంగికంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి రోజున యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరుపడం ఆలయ సంప్రదాయం. ఈ లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం పర్యవేక్షకులు,

సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.