హెటిరోలో కొనసాగుతున్న ఐటి సోదాలు


దదాపు 142 కోట్ల నగదు స్వాధీనం
హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనంసాక్షి):  హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 రాష్టాల్ల్రో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్‌, దుబాయ్‌, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్కులతో పాటు ఎలక్టాన్రిక్‌ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది. 16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు లెక్కతేలాల్సి ఉంది.