యాదాద్రిలో కార్తీక శోభసత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక

యాదాద్రి భువనగిరి,నవంబర్‌22 (జనం సాక్షి) : యాదాద్రి  శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు.  కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వేదమంత్ర పఠనాల మధ్య ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించే పూజారులు బాలాలయంలోని అభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన ఈ క్షేత్రంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అధికంగా కొనసాగాయి. శ్రీ నారసింహుడిని దర్శించిన భక్తులకు శివాలయ సందర్శన కలగడం మరో విశేషం. కార్తీక మాసంలో ఆలయాలను సందర్శించి వ్రతాలు నిర్వహించడం శుభదాయకమని పండితులు, పూజారులు చెబుతున్నారు. ఆలయ విస్తరణ పర్వంలోనూ గతంలో కొనసాగిన మండపాలలోనే వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు.