వచ్చే ఏడాది కోవిడ్‌ మహమ్మారికి ముగింపు


బ్లాగ్‌లో తెలిపిన  బిల్‌ గేట్స్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనంసాక్షి ): 2022లో కోవిడ్‌ మహమ్మారికి చెందిన తీవ్రదశ ముగుస్తుందని బిల్‌ గేట్స్‌ అంచనా వేశారు. కోవిడ్‌ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో ఆయన అంచనా వేశారు. మైక్రోసాప్ట్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ గేట్స్‌  తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల ఆందోళన పరిస్థితి తప్పదన్నారు. ఈ దశలో మరో సంక్షోభాన్ని అంచనా వేయలేమని, కానీ మహమ్మారికి చెందిన తీవ్రదశ వచ్చే ఏడాది ముగియనున్నట్లు ఆయన తెలిపారు. గేట్స్‌ నోట్స్‌ బ్లాగ్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కొన్ని ఏండ్లలో ప్రతి సీజన్‌లో కోవిడ్‌, ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి వస్తుందన్నారు. మోల్‌నుపిరావిర్‌ యాంటీవైరల్‌ మాత్రలతో కోవిడ్‌ తీవ్రత నుంచి బయటపడవచ్చు అని ఆయన అన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్నారు. అయితే వ్యాక్సిన్‌ అసమానతలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.