ఖమ్మంలో గెలుపొందిన తాతా మధు

 


238 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ నేత విజయం
ఉమ్మడి జిల్లాలో గెలుపుపై మంత్రి పువ్వాడ అభినందన
కెసిఆర్‌ నాయకత్వంపై తిరుగులేని నమ్మకం అన్న నామా
ఖమ్మం,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరేసింది. ఇక్కడ గులాబీ పార్టీ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సవిూప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. మిగతా వాటిలో టీఆర్‌ఎస్‌కు 480, కాంగ్రెస్‌కు 242 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి. కాగా, నల్లగొండలో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలుపుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, టిఆర్యస్‌ పార్టీ నేతలకు, కార్యకర్తలకు మంత్రి పువ్వాడ, ఎంపి నామాలు కృతజ్ఞతలు తెలిపారు. 12కు 12 ఎమ్మెల్సీ స్థానాల తెరాస కైవసం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తాతా మధుసుధన్‌ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎంపి నామాతో కలసి మాట్లాడతుతూ గెఉపునకు సహకరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు అని అన్నారు. ఆరు స్థానాలలో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తాతా మధు, భానుప్రసాదరావు, రమణ, విఠల్‌, యాదవరెడ్డి, కోటిరెడ్డిలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విదంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టి ఆర్‌ యస్‌ ను బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని ఆయన చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, టిఆర్‌ఎస్‌ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. టిఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందని, ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు
గెలవడం, క్లీన్‌ స్వీప్‌ చేయడం గర్వకారణమన్నారు.ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్‌ జరిగిన ఆరింటిని భారీ మెజారిటీతో గెలవడం టిఆర్‌ఎస్‌, సీఎం కెసిఆర్‌ , పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వం పట్ల, వారి పరిపాలనా పటిమ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే ఈ గెలుపుకు నిదర్శనమన్నారు. అలాగే గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం యావత్తు టిఆర్‌ఎస్‌, సీఎం కెసిఆర్‌ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.ఈ విజయాలతో మరింత ఉత్సాహం తో ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు టిఆర్‌ఎస్‌ కు కొండంత అండ అని మంత్రి పేర్కొన్నారు.