హైదరాబాద్,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- ముచ్చింతల్లో కొలువై ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను చినజీయర్ స్వామితో పాటు వేద పండితులు శాస్తోక్తర్రగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు.సుమారు మూడు గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు.
సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్