ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు


ఏప్రిల్‌ 20 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):2021` 22 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష ఏప్రిల్‌ 11న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఏప్రిల్‌ 12 న జరగనుంది. ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలను నిర్వహించనున్నారు. కాకపోతే వాటి షెడ్యూల్‌ను ఇంకా ఇంటర్‌ బోర్డు ప్రకటించలేదు.