హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జ్వరం తగ్గితే ముచ్చింతల్ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పటాన్చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.