నాణ్యమైన విత్తనాలే వ్యవసాయానికి బలం







అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన

అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణిక
అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్ర ప్రారంభంలో మంత్రి
హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి):  సరికొత్త ఆవిష్కరణల ద్వారా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని అన్నారు.వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం హైదరాబాద్‌ లో వుండడం మనకు గర్వకారణమని అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్‌ ఎ ఓ వెల్లడిరచిందని తెలిపారు. హైదరాబాద్‌ ను చూసి గర్వపడే పరిస్థితి కేసీఆర్‌ కల్పించారని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఐటీరంగం పురోగమిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని,వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామని అన్నారు. విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నా మని, దీనికి మనం గర్వపడాలన్నారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్‌ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పారు.కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్‌ ను నింపిన ఘనత కేసీఆర్‌ దని చెప్పారు.కోటి ఎకరాలకు పైగా తెలంగాణలో భూములు సాగవుతున్నాయి. పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నామని అన్నారు. వరి దిగుబడిలో పంజాబ్‌ ను తలదన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో విత్తనరంగం విూద దృష్టి సాధించడం జరుగుతున్నదని చెప్పారు. ప్రపంచంలో 70,80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని, విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం వుందన్నారు. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్‌ వినియోగం మరింత పెరుగుతుందన్నారు. రూ.7 వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విత్తన ల్యాబ్‌ను నిర్మించారు. ఇటీవలే ఈ ల్యాబ్‌కు స్విట్జర్లాండ్‌ వేదికగా కొనసాగే అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేం ద్రంగా తెలంగాణ ల్యాబ్‌ నిలిచింది. ఈ ల్యాబ్‌ దేశంలోనే అతిపెద్దది. అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్‌ఏవో వెల్లడిరచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్‌ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్‌ కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామన్నారు. విత్తన బాంఢాగారంగా ప్రపంచ స్థాయిలో కీర్తి గడిస్తున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్‌ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తన రంగం విూద దృష్టి
సాధించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్‌ వినియోగం మరింత పెరుగుతుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.